చెన్నై : యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కు కోలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యతో చెన్నై వేదికగా శుక్రవారం ఉదయం వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీ తారలు సందడి చేశారు. చెన్నైలోని ఫంక్షన్ హాల్లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ విశాల్ తాజాగా ట్వీట్ చేశారు.
” మై డార్లింగ్ అధిక్, నా సోదరి ఐశ్వర్యకు హఅదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు.. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అధిక్.. నా సోదరిని ఒక యువరాణిలా చూసుకో ” అని రాశారు.