యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వానంద్, రాజశేఖర్ కలిసి నటించనున్నారు. గతంలో ఈ బ్యానర్లో శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. గత నెలలో ‘శర్వా-36’ పేరుతో ఈ చిత్రం ప్రారంభమైంది. లూజర్ అనే వెబ్ సిరీస్తో మంచి గుర్తింపును తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా నాయర్ కథానాయికగా చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.