‘ఒక పుస్తకం, ఒక పెన్, ఒక స్టూడెంట్, ఒక టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరు’ అంటూ సమంత తన ఇన్స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత విదేశాల్లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుని ఇటీవల భారత్కి తిరిగివచ్చారు. హైదరాబాద్లోని ఓ స్కూల్ స్పోర్ట్స్ డే వేడుకలలో తాజాగా పాల్గొన్నారు. స్కూల్ పిల్లలతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పైవిధంగా పోస్టు చేశారు.