బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రామాయణం’. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్బీర్కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాకే ‘రామాయణం’ సెట్స్లో అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తారని సమాచారం.