గాంధీనగర్ : 1996లో ఒక న్యాయవాదిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్కు గుజరాజ్లోని సెషన్స్ కోర్టు గురువారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1996లో న్యాయవాదిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పాలన్పూర్లో న్యాయవాది బస చేసిన హోటల్ గదిలో సంజీవ్ భట్ డ్రగ్స్ను ఉంచినట్లు బుధవారమే కోర్టు నిర్ధారించింది. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ సెషన్స్ కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది. ఒక కస్టడీ మృతి కేసులో భట్ ఇప్పటికే జైలులో ఉన్నారు.