సుహాస్ హీరోగా నటించిన ‘ప్రసన్నవదనం’ ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్లో జరిగాయి. అర్జున్ వై.కె. తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ హీరోయిన్లు. ఇది మే 3న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన పుష్పలో అల్లు అర్జున్ స్నేహితుడిగా పాత్రను తొలుత సహాస్ను అనుకున్నామని అన్నారు. అప్పటికే హీరోగా సినిమాలు చేస్తున్నందున ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామన్నారు. సహజ నటుడు నాని కాబట్టి సుహాస్ని మట్టి నటుడు అంటే బాగుంటుందేమోనని వ్యాఖ్యానించారు. ఇచ్చిన పాత్రల్లో సుహాస్ అలా ఇమిడిపోతాడని అన్నారు.