Thomas Isaac:మాజీ సిఇసి ఖురేషీ సూచననైనా పరిగణనలోకి తీసుకోండి

తిరువనంతపురం :    లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ (ఇసి) నిరాకరించడంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థిక వేత్త  థామస్‌ ఐజాక్‌ స్పందించారు.  ఇసి ఇప్పటికీ మొదటి రెండు దశల్లో ప్రతి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్యను ప్రచురించాల్సి వుందని అన్నారు.  వివరాలను ప్రకటించడం ప్రాముఖ్యత గురించి కనీసం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) ఎస్‌.వై. ఖురేషీ సూచననైనా ఇసి పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.  ఈమేరకు సోమవారం ఐజాక్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

➡️