విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో పనిచేస్తున్న ఏపీవోలు, పీవోలు, మైక్రో అబ్జర్వర్లు, వీరితోపాటు జిల్లాలోని వివిధ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసులకు రేపు ఓటింగ్‌ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ ఢిల్లీ రావు తెలిపారు.

➡️