బీహార్ : బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి కారుపై ట్రక్కు పడటంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్లోని ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమాపూర్ గ్రామ సమీపంలో 80వ జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రక్కు టైరు సోమవారం అర్ధరాత్రి సమయంలో పేలింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై ముంగేర్ నుంచి కహల్గావ్కు వెళుతున్న కారుపై ట్రక్కు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో కారులో చిన్నారి సహ ఆరుగురు మరణించారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పెళ్లి కారుగా గుర్తించారు. సమీపంలో ఉన్న స్థానికులు.. సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాల నుంచి మతదేహాలను బయటకు తీశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.