రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 12:20 #neet exam, #tomorrow

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరుగుతుంది. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులను విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహణకు అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు కాకుండా, ఈ పరీక్ష మొత్తం 13 భాషలలో పెన్‌,పేపర్‌ విధానంలో నిర్వహించబడుతుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలకు, షరతులకు పరీక్ష నిర్వహణ కు సంబంధించిన నీట్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా సిటీ కోఆర్డినేటర్‌ మంజుల దేవి వివరాలను వెల్లడించారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్నారు. పరీక్షకు 5205 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలున్నాయన్నారు. ఉదయం 11:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌ తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌ వెంట తీసుకురావలసి ఉంటుందన్నారు.

➡️