ఢాకా : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్(బీసీబీ) నజ్ముల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. అనంతరం యువజన, క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీసీబీ చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. రెండు పదవులను ఒకేసారి చేపట్టేందుకు అవకాశమున్నా.. నజ్ముల్ బీసీబీ పదవిని వదులుకున్నాడు. రెండింటిపై దష్టి సారించడం కష్టమవుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హసన్ వెల్లడించారు.