ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ ఓటమిపాలైయ్యాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్లో లక్ష్యసేన్ 12-21, 21-10, 15-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ జోనాటన్ క్రిస్టీ చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్ను కోల్పోయిన అతను రెండో గేేమ్ను దక్కించుకుని పోటీలోకి వచ్చాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో 6-3తో ఆధిక్యంలో నిలిచిన ఇండోనేషియా ప్లేయర్ పుంజుకోవడంతో లక్ష్యసేన్ వెనుకబడి గేమ్తోపాటు మ్యాచ్నూ కోల్పోయాడు. లక్ష్యసేన్ నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.