అస్టనా(కజకిస్తాన్): ఇక్కడ జరుగుతున్న కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో అన్మోల్ ఖర్బ్ సహా మొత్తం నలుగురు మహిళా షట్లర్లు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో అన్మోల్ 21-11, 21-7తో యుఎఇకి చెంఇన నురాని రాతు అజ్రాహ్ ను చిత్తు చేసింది. సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన అన్మోల్ ప్రత్యర్ధికి రెండు గేమ్లలోనూ ఏమాత్రం అవకాశమివ్వకుండా రాణించింది. క్వార్టర్స్లో 17ఏళ్ల అన్మోల్ జపాన్కు చెందిన సొరానో యోషికవాతో తలపడనుంది. ఇతర పోటీల్లో దేవిక షిహాగ్ 21-12, 21-12తో 4వ సీడ్ అజర్బైజాన్కు చెందిన ఫాతిమాను చిత్తుచేసింది. 7వ సీడ్ తాన్యా షా 21-11, 21-18తో ఇజ్రాయేల్ షట్లర్ కేనియా పొలికర్పోవాను, ఇషారాణి 21-10, 21-14తో న్యూజిలాండ్కు చెందిన టిఫానీ హోను చిత్తుచేసి క్వార్టర్స్కు చేరారు.