అమెరికా- వెస్టిండీస్ వేదికలగా జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024 మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు ఇప్పటికే డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఏప్రిల్ 28న ముంబైలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీరిద్దరూ టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత జట్టును ఖారారు చేయనున్నట్లు సమాచారం.