- నేడు డబ్ల్యుపిఎల్ ఏకైక సెమీస్
- రాత్రి 7.30గం||ల నుంచి
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఏకైక సెమీఫైనల్ పోటీ శుక్రవారం జరగనుంది. బుధవారంతో ముగిసిన గ్రూప్ లీగ్ పోటీల తర్వాత టాపర్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 12పాయింట్లతో నేరుగా ఫైనల్కు చేరగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన బెంగళూరు-ముంబయి జట్ల మధ్య ఏకైక సెమీస్ శుక్రవారం జరగనుంది. ఫైనల్ బెర్తు కోసం డిఫెండింగ్ చాంపియన్ ముంబయితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢ కొట్టనుంది. తొలి సీజన్లో టైటిల్ను నెగ్గిన ముంబయి రెండో సీజన్ను ఘనంగా ఆరంభించింది. ఇక బెంగళూరు తొలి మ్యాచ్లో యూపి వారియర్స్పై విజయంతో బోణీ కొట్టినా.. ఆ తర్వాత తడబడింది. లీగ్ దశలో ముంబయి, బెంగళూరు రెండ్లుసార్లు తలపడగా చెరో మ్యాచ్లో గెలుపొందాయి. ఇరుజట్ల బలాబలాలను పరిశీలిస్తే.. విజయావకాశాలు ముంబయి, ఆర్సీబీకి సమానంగా ఉన్నాయి. నిరుడు జట్టును విజేతగా నిలిపిన హర్మన్ప్రీత్ ఈ ఏడాది ఫామ్లో ఉంది. యుపిపై అజేయంగా 95పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ సూపర్ ఫామ్లో ఉండగా.. బెంగళూరు ఓపెనర్లు యస్టికా భాటియా, హేలీ మాథ్యూస్లు శుభారంభం చేస్తే ముంబయి కష్టాలు తప్పవు.
r