అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి 58వ వార్డు కార్పొరేటర్‌ గులిగిందల లావణ్య, వార్డు అధ్యక్షులు గులిగిందల కృష్ణ ఆధ్వర్యంలో పలుఅభివృద్ధి పనులకు శుక్రవారం వైసిపి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో ఉప్పర కాలనీలో సిసి రోడ్స్‌, సిసి డ్రెనేజీల నిర్మాణం, రూ.12.50 లక్షలతో శాంతినగర్‌లో, రూ.7.22 లక్షలతో ములగాడ కాలనీలో. రూ.ఐదు లక్షలతో ఎదురువానిపాలెంలో, రూ.7.78లక్షలతో గొందేసివానిపాలెంలో సిసి రోడ్లు, సిసి డ్రైన్స్‌ మరమ్మతులకు, రూ. 41.40 లక్షలతో గుల్లలపాలెం దగ్గర శ్రీహరిపురం మెయిన్‌ రోడ్డు నుంచి హెచ్‌పిసిఎల్‌ కాంపౌండ్‌ వాల్‌ వరకు స్ట్రాంగ్‌ వాటర్‌డ్రైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉప్పర కాలనీలో రూ. 19.80 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు.గుల్లలపాలెంలో విశ్వేశ్వర దేవాలయంలో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సిఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన మంచినీటి బోరును ప్రారంభించారు. గుల్లల పాలెంలో నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పొడుగు రాజు, వేణుగోపాల్‌ రెడ్డి, అప్పల రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, గిన్ని శ్రీను, రామారావు, జగన్నాధం, కన్నబాబు, పి. సురేష్‌, సత్యానందం, శ్రీరామ రెడ్డి, వంగ శ్రీను, కోటా కృష్ణ, సుబ్బలక్ష్మి , వరలక్ష్మి , సత్యవతి, రాజేశ్వరి, గౌరమ్మ పాల్గొన్నారు.

శంకుస్థాపన చేస్తున్న ఆనందకుమార్‌

➡️