పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
పట్టణంలో ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగాయి. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల, ప్రభుత్వ గర్ల్స్ కళాశాల, అక్షరశ్రీ కళాశాల, బాలాజీ కళాశాల, నారాయణ కళాశాల, సాయి కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఏడు కేంద్రాల్లో మొత్తం 2589 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 82 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాలలోని ‘ఎ’ సెంటర్లో 15, ‘బి’ సెంటర్లో 9, బాలాజీ కళాశాలలో 9, సాయి కళాశాలలో 12, అక్షరశ్రీ కళాశాలలో 15, నారాయణ కళాశాలలో 13, ప్రభుత్వ బాలికల కళాశాలలో 9 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు ఆయా కళాశాలల సూపరింటెండెంట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ముందుగానే బోర్డు అధికారులు తెలియజేయడంతో విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.