ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

Feb 14,2024 16:19 #IAS officers, #transfers

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సుమిత్‌ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతిని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఎం. విజయసునీతను నియమించారు. సివిల్‌ సప్లయిస్‌ ఎండీ వీరపాండియన్‌కు డైరెక్టర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖలో పనిచేస్తున్న రాహుల్‌ పాండేను బాధ్యతల నుంచి రిలీవ్‌ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

➡️