‘చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం’

ప్రజాశక్తి – కడప అర్బన్‌తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయు డుతోనే రాష్ట్ర అభి వృద్ధి సాధ్యమని ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీని వాసరెడ్డి అన్నారు. ఆదివారం చెమ్ముమి యాపేటలో మాజీ సర్పంచ్‌ పుత్తా వెంక టలక్ష్మి, వెంకటసుబ్బారెడ్డితో పాటు పలువురు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. వీరిని కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాధవిరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమిలేదని పేర్కొ న్నారు. డిప్యూటీ సిఎం అంజాద్‌బాష అభివృద్ధి ముసుగులో కోట్లాది రూపాయలు ఆర్జించారని చెప్పారు. పేదల ఇళ్లు కూల్చి రోడ్లు విస్తరణ చేస్తున్నారని తెలిపారు. వైసిపి నాయకుల ఇళ్లు అక్కడా పోలేదన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని పేర్కొన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కడప నుంచి మహిళగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.గోవర్థన్‌రెడ్డి, జిలానీ బాష, డాక్టర్‌ కృష్ణకిషోర్‌, కృష్ణారెడ్డి, మాసాపేట శివ, డివిజన్‌ నాయకులు ఖాజా, రామలక్షుమ్మ పాల్గొన్నారు.

➡️