భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి
– ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
– టమోటా ప్రాసెసింగ్ యూనిట్కు భూమి పూజ
ప్రజాశక్తి – పత్తికొండ
టమోటా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. శుక్రవారం పత్తికొండలో సర్వే నెంబర్ 286లో మూడెకరాల భూమిలో రూ.12 కోట్లతో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీదేవి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఎన్నో ఏళ్ల నాటి కల అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే టమోటా రైతులను ఆదుకోవడానికి టమోటా ప్రాసెసింగ్ యూనిట్కు నిధులు మంజూరు చేశారని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపిపి నారాయణదాసు, ఎఫ్టిఒ పీడీ ఉమాదేవి, జడ్పిటిసి ఉరుకుందమ్మ, ఎఫ్టిఒ ఛైర్మన్ బనగాని శ్రీనివాస్, ఎంపిటిసిలు నెట్టెకల్లు, కేశప్ప, మండల కన్వీనర్ కారం నాగరాజు, సచివాలయాల కన్వీనర్ బళ్లారి మోహన్ కృష్ణ, తహశీల్దార్ మాధవరావు, తిరుమల కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత సిద్ధార్థ రెడ్డి, ఫణేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు..