టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-పుల్లలచెరువు : వైసిపి పుల్లలచెరువు మండల కన్వీనర్‌ బోగోలు వెంకట సుబ్బారెడ్డి, మరికొందరు శుక్రవారం ఉండవల్లిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరాడు. టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు సారధ్యంలో టిడిపిలో చేరారు. నారా లోకేష్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో కవలకుంట్ల సర్పంచి ఆవుల వెంకటరెడ్డి, మానేపల్లి సర్పంచి చిన్నపురెడ్డి రమణరెడ్డి, ఐటివరం మాజీ సర్పంచి మాగులూరి సామెయేలు, ఎఎంసి మాజీ డైరెక్టర్‌ గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలిరెడ్డి, వెంకటరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్‌, కందుల నారాయణరెడ్డి, చిట్టేల వెంగళరెడ్డి, శనగా నారాయణరెడ్డి, మంత్రూ నాయక్‌, కాయకాకుల సుబ్బయ్య, కోటయ్య పాల్గొన్నారు.

➡️