పైపులైన్లు తొలగించాల్సిందే – 2వ రోజు మత్స్యకారుల ఆందోళన

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్‌ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు చేరింది. శుక్రవారం వంటావార్పు కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. కే ఎస్‌ ఈ జెడ్‌ లో లైపిజ్‌ ఫార్మా పరిశ్రమలో చేపట్టిన పైపులైన్లు తొలగించవలసిందేనని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. దీవిస్‌ పైపులైన్‌ ద్వారా కలుషిత జలాలు సముద్రంలోకి రావడంతో మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధికి గండి కొట్టద్దంటూ మత్స్యకారులు నినదించారు. పైపులైన్లు తొలగించేవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు.

➡️