ప్రజా సమస్యల పరిష్కారానికి కషి : జెసి

ప్రజాశక్తి- రాయచోటి ‘జగనన్నకు చెబుదాం’, స్పందన కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని జెసి ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందనలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెసి ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్‌డిసి శ్రీలేక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీదారుడు సంతప్తిచెందేలా అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులు, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ, రీ ఓపెనింగ్‌ లేకుండా సంతప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు ఫిర్యాదులను స్వీకరించారు .స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️