బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన ఉండాలి

విద్యార్థినితో బ్యాంకు అధికారులు

ప్రజాశక్తి-హుకుంపేట:బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై విద్యార్ధులకు అవగాహన ఉండాలని లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ఎన్‌.రవి తేజ సూచించారు. ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కెజిబివి పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్ధులకు బ్యాంకులతో ఉపయోగాలు, అవసరాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌, పొదుపుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. స్థానిక కెజిబివి పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు నగదు బహుమతులను అందజేసారు. క్విజ్‌ పోటీలలో కెజిబివి విద్యార్థులు బహుమతి కైవశం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ డి. రాజేష్‌, హుకుంపేట బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచి మేనేజర్‌ గోపి పాల్గొన్నారు.

➡️