సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.ప్రజాశక్తి రామచంద్రాపురం.మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న 6 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 10.42 లక్షల నగదు చెక్కులను ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, మండల ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి , జడ్పిటిసి ఢిల్లీ భాను కుమార్ రెడ్డి లతో కలసి శుక్రవారం పంపిణీ చేశారు. సి.రామాపురం గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి 500000, రేఖల చేను గ్రామానికి చెందిన ఎద్దుల రాజయ్య 22000, కుప్పం బాదూరు గ్రామానికి చెందిన గణేష్ కుమార్ 20000, నూతుగుంటపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి 130000, కమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన మధుసూదన్ నాయుడు 100000, మిట్ట కండ్రిగ గ్రామానికి చెందిన రవి కి 270000 నగదు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిన మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఫోటో రైట్ అప్ ొ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేస్తున్న దృశ్యం.

➡️