సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం

పథకాలపై ప్రచారం చేస్తున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని కొర్రాయి పంచాయతీ తోటవలస గ్రామంలో సర్పంచ్‌ పి.కొములు ఆదేశాల మేరకు టిడిపి బూత్‌ ఇన్చార్జీలు, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని గిరిజనులకు టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బూత్‌ ఇంచార్జీలు కే నాగరాజు, మోహన్‌ దాస్‌, పి.ఒలేక్‌, వార్డు సభ్యులు దొంబు నాయుడు, టిడిపి నాయకులు కె రాంబాబు గిరిజనులు పాల్గొన్నారు.

➡️