జెనీవా : గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న మరో కొత్త వైరస్ను థారులాండ్లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎకోహెల్త్ అలయన్స్’ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్జాక్ వెల్లడించారు.
డిసెంబర్లో 10 వేల కరోనా మరణాలు..!
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన సంగతి విదితమే. డిసెంబర్లో దాదాపు 10 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది. కొత్త ఉపవేరియంట్ జెఎన్.1 వ్యాప్తితోపాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటమే అందుకు కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్ గురించి వెల్లడించారు.
కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం….
కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్కూ ఉందని పీటర్ తెలిపారు. థారులాండ్లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనుషులతో తరచూ కాంటాక్ట్లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్లో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.