అబ్దుల్ సత్తార్ సేవల అభినందనీయం

Feb 1,2024 00:49

ప్రజాశక్తి – బాపట్ల
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగి విధి నిర్వహణే ఘనతకు మార్గంగా భావించి వ్యవసాయ శాఖలో 32ఏళ్ళుగా విశిష్ట సేవలు అందించిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోమటిగుంట షేక్ అబ్దుల్ సత్తార్ ఉత్తమ అధికారిగా పేరు ప్రఖ్యాతి గడించారని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. అబ్దుల్ సత్తార్ ఉద్యోగ విరమణ సభ అన్నం సతీష్ ప్రభాకరకాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా సేవలు అందించారని అన్నారు. అబ్దుల్ సత్తార్‌ను పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డిఓ జి రవీంద్ర, వ్యవసాయ కమిషనర్ కార్యాలయ ఎడి వినయ్ చందు, జెఓఏలు కృపాదాస్, శ్రీధర్, విజయభారతి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మురళి, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

➡️