ఎంపి సమీక్ష కు టూరిజం నుంచి రిసెప్షనిస్ట్‌ హాజరు : అధికారి ఆగ్రహం

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ కలెక్టరేట్‌ లో మంగళవారం ఉదయం 12 గంటలకు జిల్లా అభివఅద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం. జరిగింది. కమిటి ఛైర్‌ పర్సన్‌ , అరకు ఎంపి గొట్టేటి మాధవి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ నుంచి రిసెప్షనిస్ట్‌ హాజరయ్యారు. ఉన్నతాధికారులకు బదులు రిసెప్షనిస్ట్‌ రావడం ఏంటని ఎంపి మాధవి ప్రశ్నించారు. ఎంపి అడిగిన ప్రశ్నలకు సదరు రిసెప్షనిస్ట్‌ బదుల్విలేకపోయారు. దీంతో అధికారుల తీరుపై కమిటీ ఛైర్‌పర్సన్‌, ఎంపి మాధవి నిట్టూర్చారు.

➡️