ప్రజాశక్తి-పాడేరు :బాల సదన్లో ఆశ్రయం పొందుతున్న బాలికలందరూ చదువులో బాగా రాణించి ఉత్తమ స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకాంక్షించారు. గురువారం స్థానిక తలారిసింగి దరి బాల సదన్ సందర్శించిన కలెక్టర్ బాలికలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలికలకు పలు ప్రశ్నలు వేసి సమాదాలు రాబట్టారు. వారితో ఆటలు ఆడించి, పాటలు పాడించి వారితో ఆత్మీయంగా గడిపి వారిలో నూతన ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని నింపారు. ఇటీవల బాల సదన్కు మంజూరైన రెండు వాషింగ్ మెషిన్లను, స్మార్ట్ టివి, ప్రిజ్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కంచారు.బాలికలందరికీ సామగ్రి కిట్లను కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి, ఐసిడిఎస్ పిడి ఎన్.సూర్యలక్ష్మి పాల్గొన్నారు.