ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల్ని అందజేయనున్న జగన్‌

Feb 23,2024 12:01 #ap cm jagan, #House tracks, #Ongole

ఒంగోలు : జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ పథకాల్లో భాగంగా.. ఈరోజు పేదలందరికీ సిఎం జగన్‌ ఇళ్ల పట్టాల్ని అందజేయనున్నారు. ఒంగోలులో శుక్రవారం జరగనున్న భారీ బహిరంగ సభలో ఎన్‌.అగ్రహారంలోని పేదలకు ఇళ్ల పట్టాల్ని అందజేయనున్నారు. ఈ సభలో లబ్ధిదారులైన సుమారు 21 వేల మంది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. అలాగే ఈరోజు ఒంగోలులో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సైతం సిఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

➡️