ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : ఒంగోలు 50వ డివిజన్ నెహ్రూ కాలనీకి చెందిన టిడిపి, జనసేన పార్టీ నాయకులు షేక్ సుభాని అతని, అనుచరులు శనివారం వైసిపిలో చేరారు. వైసిపి నాయకుడు మారెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.