చంద్రబాబును కలిసిన నేతలు

Dec 10,2023 23:28

ప్రజశక్తి – చీరాల
టిడిపి అధినేత చంద్రబాబు తుఫాను బాధితులను పరామర్శించేందుకు బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్బంగా బాపట్ల టిడిపి కార్యాలయంలో చీరాలకు చెందిన విద్యావేత్త డాక్టర్ పోగడదండ రవికుమార్ కలిశారు. గతంలో తాను టిడిపి తరుపున చేసిన కార్యక్రమాలను బాబుకు వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ అప్పట్లో రామానాయుడు తోపాటు వచ్చి కలిసారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ప్రస్తుతం పూర్తి సమయం పార్టీలో కొనసాగుతున్నానని వివరించారు. మీలాంటి వారి అవసరం సమాజానికి ఎంతో ఉందని టిడిపి ఇన్చార్జి కొండయ్యతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాబు సూచించారు.


చంద్రబాబుతో సజ్జా
టిడిపి చీరాల నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు చంద్రబాబు పర్యటన సందర్భంగా పర్చూరులో కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

➡️