ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా మేఘ స్వరూప్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ను కలిసి ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్మోహన్ రెడ్డి, అదనపు కమిషనర్ రమణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి, వివిధ విభాగాల సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.