శ్రీవారి అన్నప్రసాదం క్వాలిటీ పెంచాలి : లోకేష్‌

Dec 6,2023 10:48 #Nara Lokesh
nara lokesh on ycp govt

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదం అధ్వానంగా ఉందని యాత్రికులు ఆగ్రహిస్తున్నా.. టిటిడి పట్టించుకోవడం లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో అన్నదాన నిలయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ 1985 ఏప్రిల్‌ 6న ప్రారంభించారని, అప్పటి నుంచి అంచెలంచెలుగా అందరి సహకారంతో అన్నదాన సత్రాలు విస్తృతంగా ఏర్పాటై ఇప్పటి వరకు కోట్లాది మందికి అన్న ప్రసాదాన్ని అందించి ఆకలి తీర్చాయని లోకేష్‌ పేర్కొన్నారు. తన కుమారుడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రతియేటా రూ.30 లక్షలను విరాళంగా ఇస్తుంటామని, తనలాగే లక్షలాది మంది దాతలు అన్నప్రసాదానికి విరాళాలు ఇస్తున్నారన్నారు. అన్నప్రసాదం క్వాలిటీని పెంచాలన్నారు.

➡️