ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపించా…

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి తనకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవి

ప్రచారం చేస్తున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి తనకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవి కట్టబెట్టడంతో పలాస నియోజకవర్గంలో ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేసి చూపించానని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజలకు సేవలు అందిస్తామని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని భైౖరిసారంగపురం, బాలిగాం, హరిపురం గ్రామాల్లో బుధవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి నాయకులు ఇస్తున్న బూటకపు హామీలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వైసిపి హయాంలో మందస రోడ్డు విస్తరణ పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దామన్నారు. గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఉద్దాన ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కారానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా, సచివాలయం, హెల్త్‌ సెంటర్ల భవనాలు సైతం నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి డొక్కరి దానయ్య, జెడ్‌పిటిసి సవర చంద్రమ్మ, అగ్గున సూర్యారావు, చింతాడ గణపతిలు పాల్గొన్నారు.

 

➡️