పూలే విగ్రహంకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్న కూటమి నాయకులు
హిందూపురం : దేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఆదర్శనీయుడు జ్యోతిరావ్ పూలే అని పలువురు కొనియాడారు. పూలే జయంతిని పురష్కరించుకుని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు గురువారం పట్టణంలోని సూగూరుా అంజినేయ ఆలయ సమీపం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావ్పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆపార్టీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక పాల్గొని నివాళులు అర్పించారు. జ్యోతి రావ్ పూలే దేశానికి చేసిన సేవలు, స్త్రీ విధ్యకు చేసిన కృషి అమోఘమన్నారు. అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి సాధికారత కోసం కషి చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ, వైసిపి నాయకులు వేణురెడ్డి, నాగభూషన్ రెడ్డి, పాల్గొన్నారు. కూటమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు రమేష్ కుమార్, సీనియర్ నాయకులు అమర్నాథ్, దుర్గా నవీన్, అంజినప్ప, జనసేన ఆకుల ఉమేష్, బిజెపి ఆదర్శ్ కమార్ పాల్గొన్నారు. వివిధ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.