నీ చరిత్రను వీధిలో పెడతాం

Mar 24,2024 13:31 #Nellore District

డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టిడిపి ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డ పై ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై చేసిన విమర్శలకు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి అదే రీతిలో ఘాటైన ప్రతి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. తాను ప్రసన్నకుమార్ చరిత్రను వీధిలో పెడతాం అంటూ హెచ్చరించారు. జిల్లా నుండి పుచ్చలపల్లి, నేదురుమల్లి, నల్లపురెడ్డి లాంటి వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉందన్నారు. దురదృష్ట వశాత్తూ కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారి సతీమణి ప్రశాంతి రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అనంతరం నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నవిజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ సాయి రెడ్డి అన్న ఇది విశాఖ కాదు నెల్లూరు జిల్లా అని గుర్తుంచుకొని విమర్శలు చేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనీసం ఆయన పర్యటించిన ప్రాంతంలో కార్పొరేటర్ పేరు తెలియకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు.  అల్లుడు అరవిందో కంపెనీల పేరుతో విశాఖ నుండి,పోర్టు ల నుండి ఏమీ చేస్తున్నాడో ప్రజలకు తెలుసు అన్నారు. 150 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కడుతున్న సాయిరెడ్డి నిరుపేద అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. విజయ సాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే జిల్లాలో ప్రజలు తమ స్థలాలకు కంచెలు వేసుకుంటున్నారన్నారు. మీరు ఏమిచేసారో ఏమీ చేస్తారో ప్రజలకు చెప్పుకోండి, అంతే కానీ మా వేమిరెడ్డి జోలికి వస్తే తట్టుకోలేరంటూ హెచ్చరించారు.

➡️