Bihar కుప్పకూలిన బ్రిడ్జి – ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Mar 22,2024 10:25 #Bihar, #Collapsed bridge, #dead, #injured

పాట్నా (బీహార్‌) : బీహార్‌లోని సౌపాల్‌లో కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలింది. వంతెనపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్‌ వేస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఒకరు మృతిచెందగా, కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు. జిల్లా అధికారులు మాట్లాడుతూ … ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని చెప్పారు. వంతెన కింద కొందరు కూలీలు చిక్కుకున్నారని వారిని బయటకు తీశామన్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

➡️