టోక్యో (జపాన్) : జపాన్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 7.4గా నమోదైందని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తయోమా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా..? అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/earthquake.jpg)