ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

Jan 19,2024 11:45 #AP, #ap government, #Supreme Court

న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్‌ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉపయోగించకూడదని ఆదేశించింది. రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించడానికి అప్పటి ప్రభుత్వం 35 ఎకరాల భూమిని కేటాయించింది.

➡️