పుణేలో ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై దాడి

Jan 25,2024 08:08 #Dharna, #SFI
  • నేడు దేశవ్యాప్త నిరసన : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పుణేలోని ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై జరిగిన ఫాసిస్టు దాడిని ఖండిస్తూ గురువారం దేశవ్యాప్త నిరసనలకు ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పిలుపు ఇచ్చింది. విద్యార్థులపై హిందూ జన్‌ జాగరణ్‌ సంస్థ సభ్యులు చేసిన దాడిని పిరికిపంద చర్యగా ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ బిస్వాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ”పూణెలోని ఎఫ్‌టిఐఐ క్యాంపస్‌లోకి సాయుధులైన వ్యక్తుల గుంపు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఎఫ్‌టిఐఐఎస్‌ఎ బ్యానర్‌ను కూడా గుంపు దగ్ధం చేసింది” అని తెలిపారు.

➡️