నోయిడా : గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సుర్జాపూర్లో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు గోడ పునాది బలహీనపడిందని భావిస్తున్నారు. గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల మృతదేహాలపై పడింది. తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు మరణించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/A-wall-under-construction-collapsed-in-Greater-Noida.jpg)