Jammu Kashmir  పడవ బోల్తాపడి నలుగురు మృతి

జమ్ము కాశ్మీర్‌ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్‌ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు … గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా… జలాశయాలు ఉప్పొంగాయి. శ్రీనగర్‌ సమీపంలోని జీలం నదికి వరద పోటెత్తింది. అప్పటికే వాన దెబ్బకు కొండచరియలు విరిగిపడటంతో సోమవారం జమ్మూ-శ్రీనగర్‌ హైవేను మూసివేశారు. ఈక్రమంలో జీలం నదిలో పడవపై పలువురు గాంద్‌బల్‌ నుండి బట్వారాకు వెళుతుండగా, పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కొంతమంది గల్లంతయ్యారు. పడవలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడగా, గల్లంతయిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

➡️