- ఎస్పి – కాంగ్రెస్ ఐక్యతారాగం
- అమేథీ, రాయ్ బరేలీలో విజయం కోసం కృషి
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఎస్పి – కాంగ్రెస్ కూటమి ఐక్యతారాగాన్ని ఆలపిస్తోంది. సీట్ల సర్దుబాట్ల తర్వాత అఖిలేశ్, రాహుల్ హవా నడుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పి – కాంగ్రెస్ కూటమి విఫలమైన విషయాన్ని రెండు పార్టీలు గుర్తించాయి. ఇప్పుడు కలిసి పోటీకి దిగటంతోపాటు విజయం సాధించాలన్న పట్టుదల ఆ రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. అమేథీ, రారుబరేలీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇరు పార్టీల కార్యకర్తలు మైదానంలో ఒక జట్టుగా పని చేస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అమేథీ, రారుబరేలీలలో బ్యాక్-టు-బ్యాక్ కార్నర్ సమావేశాలు, ర్యాలీలతో దూసుకెళ్తున్నారు. ఆమె బహిరంగ కార్యక్రమాలతో సమాజ్వాదీ పార్టీకి చెందిన రెడ్ క్యాప్ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. 2017లో పొత్తుల హడావుడి అట్టడుగు స్థాయికి చేరుకోలేక పోయిందని, కాగితాలపైనే మిగిలిపోయిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఇక్కడి ఎస్పి, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
మా అధినేత అఖిలేశ్ యాదవ్ పొత్తును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్కు ఇచ్చిన 17 స్థానాల్లోని ఆఫీస్ బేరర్లు, ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ‘మీ పార్టీలా ఎన్నికల్లో పోరాడండి’ అని చెప్పారని బరేలీ జిల్లా చీఫ్ వీరేంద్ర యాదవ్ తెలిపారు. రారుబరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కిషోరీ లాల్ శర్మను విజయం వైపు నడిపించటానికి సర్వశక్తులు ఒడ్డినట్టు చెప్పారు. బిజెపితో పట్ల ప్రజలు విసిగిపోయారని, రారుబరేలీలో రాహుల్ గాంధీ రికార్డు మెజార్టీతో గెలుస్తారని, అమేథీలో శర్మ మంచి మెజార్టీతో గెలుస్తారని ఎస్పి, కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడి ఎస్పి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు, హామీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో మీడియా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు అన్షు అవస్తీ మాట్లాడుతూ రారుబరేలీ, అమేథీలలో ఎస్పి కార్యకర్తలు గాంధీ కుటుంబంతో సన్నిహితంగా, కుటుంబ పరంగా, చాలా భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నారని, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు.
రాయ్ బరేలీలో ఎస్పి జిల్లా మాజీ అధ్యక్షుడు రామ్ నరేష్ యాదవ్ మాట్లాడుతూ తమ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగానే ఉత్సాహంగా ఉన్నారని, రారుబరేలీ, అమేథీలలో ఇండియా వేదిక అభ్యర్థులు భారీ విజయం సాధించేలా కృషి చేస్తున్నారని తెలిపారు. రారుబరేలీ నియోజకవర్గం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. బచ్రావాన్ హర్చంద్పూర్, రారు బరేలీ, ఉంచాహర్, సరేని. అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం తిలోయి, సలోన్, జగదీష్పూర్, గౌరీగంజ్ , అమేథీ అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. 10 అసెంబ్లీ సెగెంట్లలో ఆరుగురు ఎస్పి ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఇద్దరు బిజెపికి మద్దతు పలికారు. సాంప్రదాయకంగా ఎస్పి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కు నిశ్శబ్దంగా మద్దతునిస్తుంది, గాంధీ కుటుంబానికి అండగా నిలుస్తోందని ఎస్పి శ్రేణులు అంటున్నాయి. ఈసారి రెండు పార్టీల మధ్య ప్రకటిత పొత్తు ఉండడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం కనిపిస్తోంది.
ఏదైనా ర్యాలీ లేదా కార్నర్ మీటింగ్లో రెండు పార్టీల కార్యకర్తలు మమేకమవుతున్నారు. గౌరీగంజ్లోని కాంగ్రెస్ కార్యాలయం ప్రధాన గేటుపై రెండు పార్టీల జెండాలు ఉన్నాయి. ఆ కార్యాలయంలో ఎక్కడ చూసినా రెండు పార్టీల జెండాలే దర్శనమిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లేదా కిషోరి లాల్ శర్మ లేదా ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రసంగించే ఏదైనా కాంగ్రెస్ బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో ఎస్పి కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇది కేవలం పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలకే పరిమితం కాలేదని తెలుస్తోంది. మద్దతుదారులు కూడా పొత్తుపై ఉత్సాహంగా ఉన్నారు. అమేథీలోని షాఘర్ గ్రామానికి చెందిన కమలేష్ యాదవ్ మాట్లాడుతూ తాను అఖిలేశ్ యాదవ్కు గట్టి మద్దతుదారునని, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నందున తన ఓటు, మద్దతు కాంగ్రెస్కేనని చెప్పారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో బ్రాహ్మణ, యాదవుల జనాభా గణనీయంగా ఉంది. రారుబరేలీలో బిజెపి అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, గాంధీ కుటుంబ సన్నిహితుడు లాల్ శర్మ అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ పోలింగ్ జరగనుంది.