- మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
రాజస్థాన్ : రాజస్థాన్లోని కోటాలో ఐఐటీ జేఈఈకి శిక్షణ పొందుతూ ఈ నెల 11న అదశ్యమైన విద్యార్థి చంబల్ లోయలో శవమై కనిపించాడు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ సోంధియా కోటాలో చదువుకుంటున్నాడు. పరీక్ష ఉందని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రచిత్ చివరిసారి గరాడియా మహాదేవ్ ఆలయ సమీపంలోని అడవిలోకి వెళ్తూ అక్కడి సెక్యూరిటీ కెమెరాలకు చిక్కాడు. ఆ తర్వాత అతడి జాడ కనిపించలేదు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్తో వారం రోజులపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చంబల్ లోయలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.కొండపై నుంచి దూకి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రచిత్ మృతితో ఈ నెలలో కోటాలో మరణించిన విద్యార్థుల సంఖ్య నాలుగుకు పెరిగింది. కాగా అదశ్యమైన మరో విద్యార్థి పీయూష్ కపాసియా కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.