Ladakh:ఆకస్మిక వరదల్లో ఐదుగురు సైనికుల మృతి

Jun 29,2024 20:33 #Army, #death, #Five jawans, #ladakh

-కొట్టుకుపోయిన యుద్ధట్యాంక్‌
శ్రీనగర్‌ : ఆకస్మిక వరదల్లో టిా72 యుద్ధట్యాంక్‌ కొట్టుకుపోవడంతో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లఢఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) సమీపంలో ష్యోక్‌ నదిలో మందిర్‌ మోర్‌కు సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎక్సర్‌సైజులో భాగంగా ట్యాంక్‌ నదిని దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో మరణించిన జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జెసిఒ)తోసహా ఐదుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ష్యోక్‌ నదిలో అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో ఈ ప్రమాదం జరిగిందని, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నా.. నీటి ప్రవాహ ఉధృతి కారణంగా సిబ్బందిని రక్షించలేకపోయారని లేV్‌ాలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

➡️