ముర్షిదాబాద్‌లో మహ్మద్‌ సలీం నామినేషన్‌ దాఖలు

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ సెంటర్‌ లోక్‌సభ స్థానం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం గురువారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సలీం అభ్యర్థిత్వానికి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అధిర్‌ రంజన్‌ చౌదరీ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జమీర్‌ మెల్లా, శత్రుప్‌ ఘోష్‌, మీనాక్షి ముఖర్జీ, ధరుభ్‌జ్యోతి సాహా, పలువురు లెఫ్ట్‌ఫ్రంట్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️