కోల్కతా : పశ్చిమబెంగాల్లోని 42 లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఫోరంను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ”మాకు కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు లేవు. బెంగాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇండియా ఫోరంపై నిర్ణయం తీసుకుంటాం” అని అన్నారు.
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇండియా ఫోరంలోని పార్టీల మధ్య అంతరాలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీకి, కాంగ్రెస్కు మధ్య పెరుగుతున్న వైరుధ్యాన్ని ఉద్ఘాటించారు. మరికొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర తమ రాష్ట్రంలోకి ప్రవేశించనుందని, కానీ తనకు సమాచారం ఇవ్వాలన్న కనీస మర్యాద పాటించలేదని మండిపడ్డారు.