న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఎన్సిపి అధినేత శరద్ పవార్, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయోధ్యలో పవిత్రోత్సవం తర్వాత దర్శనానికి వస్తానని పవార్ రామాలయం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రారుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్.. రామమందిరం ప్రారంభోత్సవానికి తాను వెళ్లడం లేదన్నారు. అదే సమయంలో బీహార్లో అఖిలపక్షం మధ్య సీట్ల చర్చలు సాగుతున్నాయని తెలిపారు. ఒక అవగాహనకు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.